న్యాయ సేవా సంస్థ కార్యదర్శిగా విక్రం
ABN, First Publish Date - 2021-04-23T05:15:54+05:30
ఉమ్మడి జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శిగా సీనియర్ సివిల్ జడ్జి విక్రం గురువారం సంస్థ కార్యాలయం న్యాయసేవాసదన్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
నిజామాబాద్లీగల్, ఏప్రిల్ 22 : ఉమ్మడి జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శిగా సీనియర్ సివిల్ జడ్జి విక్రం గురువారం సంస్థ కార్యాలయం న్యాయసేవాసదన్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన జిల్లా జడ్జి సంస్థ చైర్పర్సన్ కే.సాయిరమాదేవిని మర్యాదపూర్వకంగా కలిసారు. కొన్ని నెలలుగా కార్యదర్శి పదవి బాధ్యతలను కిరణ్మయి నిర్వహించారు. వరంగల్ సీనియర్ సివిల్జడ్జి కోర్టు నుంచి జే.విక్రంను హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిజామాబాద్ న్యాయసేవాసంస్థకు బదిలీ చేశారు. విషయమై పలువురు న్యాయవాదులు రాజ్కుమార్సుబేదార్, మానిక్రాజ్, ఆశ నారాయణ, శ్యాంబాబులు విక్రంను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
Updated Date - 2021-04-23T05:15:54+05:30 IST