ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ బండి సంజయ్‌ను కలిసిన టీఆర్‌ఎస్‌ నాయకులు

ABN, First Publish Date - 2021-02-25T04:47:42+05:30

టీఆర్‌ఎస్‌ మాజీ ఏఎంసీ చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మర్యాధపూర్వకంగా కలిశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాన్సువాడ, ఫిబ్రవరి 24: టీఆర్‌ఎస్‌ మాజీ ఏఎంసీ చైర్మన్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మర్యాధపూర్వకంగా కలిశారు. బాన్సువా డ ఏఎంసీ చైర్మన్లుగా పనిచేసిన నార్ల సురేష్‌, కొత్తకొండ భాస్కర్‌, మాజీ ఎంపీటీసీ డాకయ్య కలిశారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్‌ నాయకులు మాల్యాద్రిరెడ్డి, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.

బహిరంగ సభను విజయవంతం చేయండి

బాన్సువాడ టౌన్‌, ఫిబ్రవరి 24: పట్టణంలోని వారాంతపు సంత ప్రాంతంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేవైయం జిల్లా అధ్యక్షుడు చైతన్యగౌడ్‌ కోరారు. బుధవారం సభాస్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ రానున్నట్లు తెలిపారు. బీజేపీ, బీజేవైయం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో శంకర్‌గౌడ్‌, రాజాసింగ్‌, గోపాల్‌, సాయికిరణ్‌, గంగారెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2021-02-25T04:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising