ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంతలో పడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-06-22T05:41:02+05:30

మంచిప్ప రిజర్వాయర్‌ పైపు లైను కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం రామడుగు గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరికొండ జూన్‌ 21 : మంచిప్ప రిజర్వాయర్‌ పైపు లైను కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం రామడుగు గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం తొమ్మిది గంటల సమయంలో  ఎర్రోల్ల ప్రేమానందం(28) అనే యువకుడు టీ తాగి పొలం వద్దకు వెళ్లి వస్తానని బయలుదేరాడు. పొలానికి వెళ్తుండగా ప్రమాద వశాత్తు గుంతలో పడ్డాడు. గుంత బురదమయంగా ఉండడంతో అందులో కూరుకుపోయి మృతి చెందాడు. దీనికి గమనించిన ఇతర రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లి భూదెవ్వ ఇతర కుటుంబ సభ్యులు సంఘటన వెళ్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటన స్థలానికి వెళ్లిన ఎస్సై రాజశేఖర్‌ శవ పంచనామా చేసి పోస్టుమార్టం కోసం శవాన్ని నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. భూదెవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చి వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-22T05:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising