నీడనిచ్చే మొక్కలనే నాటాలి
ABN, First Publish Date - 2021-12-05T04:59:44+05:30
మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో నర్సరీని శనివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.
సదాశివనగర్, సెప్టెంబరు 4: మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో నర్సరీని శనివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. నర్సరీలో నీడనిచ్చే మొక్కలు అధికంగా పెంచాలని తెలిపారు. మర్రి, వేమ, కానుగ, రావి, మామిడి, మోదుగ వంటి వాటిని పెంచాలని అధికారులను ఆదేశించారు. 10వేల మొక్కలు గృహాలకు పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. శ్రమశక్తి సంఘాల ద్వారా పనులను గుర్తించి కూలీలకు ఉపాఽధి కల్పించాలని కోరారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జానకి, జనార్దన్, ఎంపీడీవో రాజ్వీర్, ఉప సర ్పంచ్ లక్ష్మీపతి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంలు నిల్వ ఉంచిన గోదాంల పరిశీలన
కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని గోదాంల్లో నిల్వ ఉంచిన ఈవీఎంలను శనివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. గోదాంకు సీజ్ చేసి ఉన్న తాళాలను పరిశీలించారు. బం దోబస్తు వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎ న్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-05T04:59:44+05:30 IST