బంధువుల వద్దకు వెళుతున్నానని చెప్పి..
ABN, First Publish Date - 2021-01-24T04:45:27+05:30
బంధువుల వద్దకు వెళుతున్నానని చెప్పి శని వారం నిజాంసాగర్ ప్రాజెక్టులో ఓ మహిళ శవమై కనిపించింది.
నిజాంసాగర్, జనవరి 23: బంధువుల వద్దకు వెళుతున్నానని చెప్పి శని వారం నిజాంసాగర్ ప్రాజెక్టులో ఓ మహిళ శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామానికి చెందిన నాటకారి పోచవ్వ (58) భర్త కొన్నాళ్ల క్రితమే చనిపోయాడు. శుక్రవా రం బంధువుల వద్దకు వెళుతున్నానని ఇంట్లో చెప్పింది. శనివారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టు 20వరద గేట్ల వద్ద మృతదేహం ఇరిగేషన్ అధికారు లకు కనిపించింది. చిన్న ఆరేపల్లి గ్రామంలోని బంధువులు నాటకారి పోచవ్వ గా గుర్తించారు. భర్త చనిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పా ల్పడిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అల్లుడు నారాయణ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజలింగం తెలిపారు. అనం తరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడకు తరలించారు.
Updated Date - 2021-01-24T04:45:27+05:30 IST