మద్నూర్లో ఇసుక వేలం
ABN, First Publish Date - 2021-04-16T06:18:43+05:30
అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్న ఇసుక టిప్పర్ను తహసీల్దార్కు అందజేశారు.
మద్నూర్, జనవరి 15: అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్న ఇసుక టిప్పర్ను తహసీల్దార్కు అందజేశారు. మద్నూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇసుక వేలం నిర్వహించారు. రూ.23వేలకు పాట పాడటంతో వా రికి అందజేశామని ఎస్సై రాజు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Updated Date - 2021-04-16T06:18:43+05:30 IST