ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరనున్న రవీందర్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-06-12T05:07:32+05:30

ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖరారు అయి ంది.

ఈటలను తన నివాసంలో కలిసిన బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుంగ్‌, పక్కన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
అనుచరుల అభిప్రాయం మేరకే బీజేపీలో చేరుతున్నా : ఏనుగు

కామారెడ్డి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖరారు అయి ంది. ఈ నెల 14న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు తాను బీజేపీ లో చేరనున్నట్టు ఏనుగు తెలిపారు. శుక్రవారం ఈటల రాజేందర్‌ నివాసం లో బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుంగ్‌తో ఏనుగు రవీందర్‌రెడ్డి, మరికొందరు నాయకులు భేటీ అయ్యారు. ఈ నెల 14న బీజేపీలో ఏనుగు రవిందర్‌రెడ్డి చేరనున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిల తో పాటు మరికొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల వారీగా ఆయన అనుచరులతో, అభిమానులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని అందరి మద్దతు ఉండాలని అభిమానులను కోరారు. వారి మద్దతుతోనే బీజేపీలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాతో పాటు నియోజకవర్గం లోని పలువురు ప్రజా ప్రతినిఽధులు, ముఖ్యమైన టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరనున్నట్లు ఆయన పేర్కొంటున్నారు.
ఈటలను కలిసిన నాగిరెడ్డిపేట టీఆర్‌ఎస్‌ నాయకులు
నాగిరెడ్డిపేట, జూన్‌ 11: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను శుక్రవా రం నాగిరెడ్డిపేట మండల టీఆర్‌ఎస్‌ నాయకులు కలిశారు. హైదరాబాద్‌ లోని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ స్వగృహంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిశారు. నాగిరెడ్డిపేట మండల టీఆర్‌ ఎస్‌ మాజీ అధ్యక్షుడు, మాల్తుమ్మెద సొసైటీ మాజీ అధ్యక్షుడు రాంచం ద్రారెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు భీంరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యూత్‌ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాగిరెడ్డిపేట మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు మధుకర్‌, గోలి లింగాల్‌, మాజీ సర్పంచ్‌ శివకుమార్‌తో పాటు పలువురు ఈటల రాజేందర్‌ను కలిశారు.  
తాడ్వాయి: ఈటల రాజేందర్‌, రవీందర్‌రెడ్డిలను శుక్రవారం మండల నాయకులు హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లా డుతూ ఈటల రాజేందర్‌, ఏనుగు రవీందర్‌రెడ్డిలు ఢిల్లీకి బయలు దేరి వెళుతున్నందున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయ కులు వెంకట్‌రెడ్డి, శ్యామ్‌రావు, వెంకట్‌రెడ్డి, కిష్టాగౌడ్‌, కృష్ణమూర్తి, రాజిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-12T05:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising