12న కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ
ABN, First Publish Date - 2021-04-09T05:43:57+05:30
సారంగాపూర్ చక్కెర కార్మగారాన్ని వెంటనే తెరిపిం చాలని ఈ నెల 12న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే రైతుల బహిరంగ సభను విజయవంతం చేయాలని పీడీఎస్యూ యూనివర్సిటీ నాయకుడు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.
డిచ్పల్లి, ఏప్రిల్ 8: సారంగాపూర్ చక్కెర కార్మగారాన్ని వెంటనే తెరిపిం చాలని ఈ నెల 12న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే రైతుల బహిరంగ సభను విజయవంతం చేయాలని పీడీఎస్యూ యూనివర్సిటీ నాయకుడు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన కార్యక్రమానికి సంఘీ భావం తెలిపిన ఆయన టీయూలో విలేకర్లతో మాట్లాడారు. సారంగాపూర్ చక్కె ర ఫ్యాక్టరీలో 22వేల మంది రైతులు షేర్ హోల్డర్స్గా ఉన్నారని కర్మాగారంపై 10వేల మంది రైతు కటుంబాలు, 500 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని సాకుతో పరిశ్రమ మూసివేశారని, రైతులు చెరుకు పండించుకొని పరిశ్రమ నడిపేందుకు ప్రభుత్వ అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12న జరిగే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావాలని కోరారు. ఆయన వెంట జాదవ్ సాయికృష్ణ, ప్రేమ్చంద్, తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-04-09T05:43:57+05:30 IST