గణేష్ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
ABN, First Publish Date - 2021-09-06T05:03:58+05:30
జిల్లా కేంద్రంలో గణేష్ మండపాలు ఏర్పా టు చేసేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పట్టణ ఎస్హెచ్వో మదుసూధన్ తెలిపారు.
కామారెడ్డిటౌన్, సెప్టెంబరు 5: జిల్లా కేంద్రంలో గణేష్ మండపాలు ఏర్పా టు చేసేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పట్టణ ఎస్హెచ్వో మదుసూధన్ తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటుతో ట్రాఫిక్ అంతరాయం కల్గకుండా సహకరించాలని, మండపానికి చుట్టు పక్కల ప్రజలకు ఇబ్బంది కల్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Updated Date - 2021-09-06T05:03:58+05:30 IST