ఆక్సిజన్ పార్క్లను సంరక్షించాలి
ABN, First Publish Date - 2021-06-24T04:53:35+05:30
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలను ఆక్సిజన్ పార్కులా పెంచి సంరక్షించాలని జిల్లా స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే
రామారెడ్డి, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలను ఆక్సిజన్ పార్కులా పెంచి సంరక్షించాలని జిల్లా స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని ఎల్లంపేట, పోతారం గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రకృతి వనాలను పరిశీ లించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తప్ప కుండా ఆక్సిజన్ పార్కులను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ రావు, వైస్ ఎంపీపీ నర్సింహారెడ్డి, సర్పంచ్ గ్యార సాయిలు, కార్యద ర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-24T04:53:35+05:30 IST