ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-04-24T05:22:26+05:30

జరిమానా కట్టేందుకు డబ్బులు తీసుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాక్లూర్‌, ఏప్రిల్‌ 23: జరిమానా కట్టేందుకు డబ్బులు తీసుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మదాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాదాపూర్‌ గ్రామానికి చెందిన రమణ, ఆర్‌ఎంపీ వైద్యుడు అంజయ్యకు గురువారం స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా మధ్యవర్తులు ఇరువురిని ఒప్పించి రమణ(45)కు రూ.10వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించేందుకు రమణ బంగారు నగలు అమ్మేందుకు నిజామాబాద్‌ వెళ్లాడు. నగలును విక్రయించి డబ్బులు తీసుకుని మాదాపూర్‌ వస్తుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతదేహాన్ని ఆర్‌ఎంపీ వైద్యుడి క్లినిక్‌ వద్దకు తీసుకువచ్చి ఆందోళనకు దిగారు. వైద్యుడు పరారీ కాగా గ్రామస్థులు మెప్పించి అంత్యక్రియాలు జరిపించారు.

Updated Date - 2021-04-24T05:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising