అటవీ భూముల పరిశీలన
ABN, First Publish Date - 2021-10-22T05:18:35+05:30
మండల కేంద్రంలోని 848 సర్వేనెంబర్లో అటవీ భూ ములను గురువారం అదన పు కలెక్టర్ చంద్రశేఖర్ పరి శీలించారు.
జక్రాన్పల్లి, అక్టోబరు21: మండల కేంద్రంలోని 848 సర్వేనెంబర్లో అటవీ భూ ములను గురువారం అదన పు కలెక్టర్ చంద్రశేఖర్ పరి శీలించారు. ఈ సర్వే నెంబ ర్లో గల అటవీ భూముల్లో ఎవరెవరివి ఉన్నాయి, పట్టా లు ఇచ్చినవి ఉన్నాయా, స్థా నిక తహసీల్దార్, అధికారు లను జేసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు కొన్నేళ్ల నుం చి అటవీ భూములను సాగు చేసుకుంటున్నామని, పట్టాలు ఇవ్వాలని జేసీకి లబ్ధి దారులు విన్నవించారు. ప్రభుత్వం, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అనంతరం కొలిప్యాక్లో వారసత్వ భూములను జేసీ పరిశీలించారు. జేసీ వెంట జక్రాన్పల్లి ఉప సర్పంచ్ బాలకిషన్, తహసీల్దార్ మల్లేష్రెడ్డి, ఆర్ఐ బాలకిషన్, తదితరులు ఉన్నారు.
Updated Date - 2021-10-22T05:18:35+05:30 IST