15 వరకు నైట్ కర్ఫ్యూ
ABN, First Publish Date - 2021-05-08T05:28:32+05:30
రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూను పొడగిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్అర్బన్, మే 7: రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూను పొడగిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15వరకు రాత్రి పూట 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను పొడగించారు. పెళ్లిళ్లకు వందమందికి మించకుండా అంత్యక్రియలకు 20 మందికి మించకుండా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Updated Date - 2021-05-08T05:28:32+05:30 IST