Kamareddy: చెట్టును ఢీకొన్న బైక్...ఒకరు మృతి
ABN, First Publish Date - 2021-08-23T17:12:03+05:30
చెట్టును ఢీకొన్న బైక్...ఒకరు మృతి
కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి గంగమ్మ వాగు వద్ద ఓ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జానకంపేట్ చిన్నరాములు(50) అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య బాలమణికి తీవ్ర గాయలయ్యాయి. వీరి స్వస్థలం సిరికొండ మండలం గడ్కొల్గా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-08-23T17:12:03+05:30 IST