చేపలు పట్టేందుకు వెళ్లి.. నీటిలో మునిగి ఒకరి మృతి
ABN, First Publish Date - 2021-04-10T05:46:58+05:30
చేపలు పట్టేందుకు వెళ్లి నీటిలో మునిగి ఒకరు మృతిచెందారు.
బాన్సువాడ, ఏప్రిల్ 9: చేపలు పట్టేందుకు వెళ్లి నీటిలో మునిగి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బింగి బాలయ్య (52) బాలయ్య సోదరుడు శివయ్య వద్ద బోర్లంలో ఉంటూ జీవనం సాగి స్తున్నాడు. బాలయ్యకు ఒకే కూతురు అక్కమ్మ రజిత ఉంది. ఆమె బతుకు దెరువు కోసం హైదరాబాద్లో ఉంటోంది. కాగా, చేపలు పట్టడానికి బాన్సు వాడ కల్కి చెరువులోకి వెళ్లి నీటిలో మునిగి మృతిచెందాడు. స్థానికులు శవా న్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Updated Date - 2021-04-10T05:46:58+05:30 IST