మరింత పెరిగిన పసుపు ధర
ABN, First Publish Date - 2021-03-02T05:22:39+05:30
జిల్లా వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర మరింత పెరిగి ంది. మార్కెట్యార్డ్లో రోడ్డు మరమ్మతు పనుల నేపథ్యంలో శని, ఆదివారాల్లో మార్కెట్యార్డ్లో పసుపు వ్యాపారలావదేవీలు అధికారులు నిలిపివేశారు. దీంతో సోమవారం ఉదయం రైతులు మార్కెట్యార్డ్కు పసుపును భారీగా తరలించారు. కాగా, నాణ్యమైన పసుపునకు క్వింటాలుకు రూ.9,389 ధర పలికింది.
సోమవారం రూ.9,389లు పలికిన క్వింటాలు పసుపు
ఖిల్లా, మార్చి 1 : జిల్లా వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర మరింత పెరిగి ంది. మార్కెట్యార్డ్లో రోడ్డు మరమ్మతు పనుల నేపథ్యంలో శని, ఆదివారాల్లో మార్కెట్యార్డ్లో పసుపు వ్యాపారలావదేవీలు అధికారులు నిలిపివేశారు. దీంతో సోమవారం ఉదయం రైతులు మార్కెట్యార్డ్కు పసుపును భారీగా తరలించారు. కాగా, నాణ్యమైన పసుపునకు క్వింటాలుకు రూ.9,389 ధర పలికింది. గడిచిన వా రం రోజుల్లో ఇదే అత్యధికధరగా నమోదైంది. మోడల్ ధర క్వింటాలుకు రూ.6,666 లు పలికింది. గోలరకం పసుపునకు ధర క్వింటాలుకు రూ.7,650లు పలకగా.. మో డల్ ధర రూ.6,225 పలికింది. శుక్రవారం నాణ్యమైన పసుపునకు రూ.8,309లు ప లికింది. అంటే సోమవారం ఏకంగా రూ.వెయ్యి వరకు పెరిగింది.
Updated Date - 2021-03-02T05:22:39+05:30 IST