ముగిసిన ఇంటర్ ఫస్టియర్ రీవెరిఫికేషన్
ABN, First Publish Date - 2021-12-22T22:37:52+05:30
ఇంటర్ మీడియేట్ ఫస్టియర్ రీ వెరిఫికేషన్
హైదరాబాద్: ఇంటర్ మీడియేట్ ఫస్టియర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ గడువు ముగిసింది. రీ వెరిఫికేషన్ కోసం 31,837 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రీ కౌంటింగ్ కోసం3,489 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆల్ పాస్ ప్రతిపాదనలపై తెలంగాణ సర్కార్ ఎటూ తేల్చడం లేదు.
ఇటీవల వెలువడిన ఇంటర్ మీడియేట్ ఫస్టియర్ ఫలతాలలో సగం మంది విద్యార్థులు కూడా పాస్ కాలేదు. ఎంతోమంది మెరిట్ విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ బోర్డుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరికి మినిమం మార్కులు వేసి పాస్ చేయాలని అభ్యర్థనలు వస్తున్నాయి.
Updated Date - 2021-12-22T22:37:52+05:30 IST