ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-08-18T22:00:42+05:30

మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించారని, అంబేద్కర్‌ ఫోటోను కాళ్లతో తన్ని అవమానించారని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు దళిత నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో మల్కాజ్‌గిరి ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు అరుణ్ హల్ధర్ బాధితురాలని విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనలో గాయపడిన బాధితుల్ని పరామర్శించామని తెలిపారు. దళితులను తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది అధికారులు నిందితులను రక్షించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ఘటనపై కమిషన్ తీవ్రంగా దృష్టి సారించిందని తెలిపారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన అంశమని, నిందితులు ఎంతటివారైనా సరే 24 గంటల్లో అరెస్ట్ చేయాలని ఆదేశించారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అరుణ్ హల్ధర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-18T22:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising