21వ రోజుకు చేరుకున్న YS Sharmila ప్రజాప్రస్థానం పాదయాత్ర
ABN, First Publish Date - 2021-11-09T13:08:54+05:30
వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. 20వ రోజు సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామం నుంచి ప్రారంభమై
నల్లగొండ: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. 20వ రోజు సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామం నుంచి ప్రారంభమై జక్కలవారిగూడెం, కచలాపురం, ఊకొండి, రత్తిపల్లి గ్రామాల మీదగా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెం వరకు సాగింది. నేడు నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రజా ప్రస్థానం బ్రాహ్మణ వెల్లంల నుంచి పాదయాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది. ఉదయం 11 గంటలకు చౌడపల్లిలో ప్రతీ మంగళవారం చేపట్టే నిరుద్యోగ నిరాహారదీక్షలో షర్మిల పాల్గొనున్నారు.
Updated Date - 2021-11-09T13:08:54+05:30 IST