Yadadriలో నేటి నుంచి పుష్పాలంకరణ సేవా దర్శనం
ABN, First Publish Date - 2021-11-05T16:57:41+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఈరోజు నుంచి నూతనంగా పుష్పాలంకరణ సేవా దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ఈరోజు నుంచి నూతనంగా పుష్పాలంకరణ సేవా దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కరికి టికెట్ ధర రూ.300గా విధించారు. ఉదయం 5:30 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు పుష్పాలంకరణ సేవా దర్శనాన్ని కల్పించనున్నారు. యాదాద్రిలో స్వామి వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి వారికి అర్చకులు అష్టోత్తర శత ఘటాభిషేకాన్ని నిర్వహించారు.
Updated Date - 2021-11-05T16:57:41+05:30 IST