ధరణితో తెలంగాణ భూ సంస్కరణలో విప్లవాత్మక మార్పు: కలెక్టర్ పమేలా
ABN, First Publish Date - 2021-10-30T17:34:55+05:30
ధరణి అనేది తెలంగాణ భూ సంస్కరణలో విప్లవాత్మక మార్పు అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
యాదాద్రి-భువనగిరి: ధరణి అనేది తెలంగాణ భూ సంస్కరణలో విప్లవాత్మక మార్పు అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ధరణికి కలెక్టర్ తంబు తప్పని సరికావడంతో పారదర్శకత పెరిగిందని తెలిపారు. ధరణి వల్ల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోగలుగుతున్నామని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా 45,222 అప్లికేషన్లు పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు.
Updated Date - 2021-10-30T17:34:55+05:30 IST