వేముల మహేందర్ ఆశయాలు సాధించాలి
ABN, First Publish Date - 2021-06-23T06:43:50+05:30
సీపీఎం నాయకుడు దివంగత వేముల మహేందర్ ఆశయాలు సాధించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
సీపీఎం రా ష్ట్ర కార్యదర్శి తమ్మినే వీరభద్రం
వలిగొండ, జూన్ 22: సీపీఎం నాయకుడు దివంగత వేముల మహేందర్ ఆశయాలు సాధించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మండలంలోని పులిగిల్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన మహేందర్ అంతిమయాత్రలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మహేందర్ ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. తన జీవితాన్ని పేదలకే అంకితమిచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా కార్యదర్శి వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి సుధాకర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రాంచందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-23T06:43:50+05:30 IST