సాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటుతాం : మందకృష్ణ
ABN, First Publish Date - 2021-01-21T06:16:38+05:30
సాగర్ ఉప ఎన్నికలో పోటీచేసి సత్తా చాటుతామని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
త్రిపురారం, జనవరి 20 : సాగర్ ఉప ఎన్నికలో పోటీచేసి సత్తా చాటుతామని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో నెల రోజులు నియోజకవర్గంలో పర్యటించి ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి కృషి చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏళ్ల తరబడి పోరాడుతున్నా కొన్ని వర్గాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి వర్గీకరణకు మద్దతు తెలిపి మాట త ప్పారన్నారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. ఇటీవల మృతి చెందిన ఉపాధ్యాయ సంఘం నాయకుడు లకుపతినాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయ కర్త గొడవర్తి జానకిరామయ్యచౌదరి, జిల్లా నాయకుడు మడుపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-21T06:16:38+05:30 IST