పెద్దపల్లి హత్య వెనుక టీఆర్ఎస్, పోలీసుల హస్తం : ఉత్తమ్
ABN, First Publish Date - 2021-02-27T17:53:29+05:30
పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాదుల హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శనివారం నాడు తెలంగాణ పీసీసీ లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ...
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాదుల హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శనివారం నాడు తెలంగాణ పీసీసీ లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ. న్యాయవాద దంపతుల హత్య కేసులో టీఆర్ఎస్ నేతలు, పోలీసుల హస్తం ఉందని ఆరోపించారు. ఈ హత్యపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చేలా పార్లమెంట్లో పోరాడుతామని ఉత్తమ్ కుమారెడ్డి అన్నారు.
Updated Date - 2021-02-27T17:53:29+05:30 IST