ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత కట్టకు... కొత్త బిల్లు..?

ABN, First Publish Date - 2021-11-22T05:21:25+05:30

గతంలో పోసిన కుంట కట్టకు చెట్లు, చెదారం తొలగించి అధికార పార్టీ చెందిన ఓ నాయకుడు బిల్లు చేయించుకోవడానికి యత్నిస్తున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.

బుజిలాపురంలో బిల్లు చేయించడానికి ప్రయత్నిస్తున్న కట్ట ఇదే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అధికార పార్టీ నాయకుడి యత్నం

మోత్కూరు, నవంబరు 21: గతంలో పోసిన కుంట కట్టకు చెట్లు, చెదారం తొలగించి అధికార పార్టీ చెందిన ఓ నాయకుడు బిల్లు చేయించుకోవడానికి యత్నిస్తున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. రై తులు చెబుతున్న వివరాల ప్రకారం... మోత్కూరు మండలం బుజిలాపు రం శివారులోని కుమ్మరికుంటకు కట్ట పోయడానికి, మత్తడి(అలుగు) క ట్టడానికి గతంలో రూ.7 లక్షలు మంజూరయ్యాయి. వాటర్‌షెడ్‌ పథకం లో కట్ట పోశారు. మత్తడి కట్టలేదు. కట్ట పోసినందుకు రూ. 4 లక్షలు ప ని రికార్డు చేసి, అప్పుడు పని చేసిన వారికి చెల్లించారు. మత్తడి నిర్మించనందుకు రూ.3 లక్షలు నిలిపివేశారు. కట్ట పోసి సుమారు రెండేళ్లు అవుతుంది. ప్రస్తుతం అదే కుంట కట్టకు మరమ్మతులు, మత్తడి నిర్మాణానికి మిషనకాకతీయ ఫేజ్‌-4లో రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులు కాంట్రాక్టు తీసుకున్న అడ్డగూడూరు మండలానికి చెందిన ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇటీవల ఆ కుంటకట్టకు పెరిగిన చెట్లు, గడ్డి ఎక్స్‌కవేటర్‌తో తొలగించి, కట్ట పోసినట్లుగా బిల్లు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నార న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత కట్టకు కొత్తగా బిల్లు చేసి నిధులు దుర్వినియోగం చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఫొటో లు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఆ కట్ట వాటర్‌ షెడ్‌లో పోసిందే..

 కేమిడి సైదులు, రైతు, ముశిపట్ల

సుమారు రెండేళ్ల క్రితం కుమ్మరికుంటకు వాటర్‌షెడ్‌లో కట్ట పోశారు. అప్పుడు వాటర్‌ షెడ్‌ ద్వారా ఆ కట్టకు రూ.4 లక్షలు బిల్లు చెల్లించారు. ఇ ప్పుడు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అదే కట్టకు ఇటీవల మర మ్మతులు చేసి కొత్తగా పోసినట్లుగా బిల్లు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

   

మత్తడి కట్టనందున బిల్లు చేయలేదు

 అరుణ్‌కుమార్‌, నీటి పారుదలశాఖ, ఏఈ 

ఆ కట్ట ఇప్పుడే పోశానని కాంట్రాక్టర్‌ చెప్పారు. ఇసుక దొరకక మత్తడి నిర్మించలేదని అన్నారు. మత్తడి కట్ట కడితేనే బిల్లు చేస్తానని, బిల్లు చేయడం లేదు. మరోసారి కట్టను పరిశీలిస్తాను. 


Updated Date - 2021-11-22T05:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising