రైతు ప్రాణాన్ని బలిగొన్న బురద
ABN, First Publish Date - 2021-07-24T07:00:23+05:30
బురద రైతు ప్రాణాన్ని బలిగొంది
వలిగొండ, జూలై 23: బురద రైతు ప్రాణాన్ని బలిగొంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎదుల్లగూడెం గ్రామానికి చెందిన రైతు బోడపట్ల కృష్ణారెడ్డి(40) శుక్రవారం పొలం గట్టుపై నుంచి నడుచుకుంటూ వెళుతూ ప్రమాదవశాత్తు కాలు జారి పొలంలో పడ్డాడు. అక్కడ బురద ఉండటంతో మొఖం కూరుకుపోవడంతో శ్వాస ఆడక అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప రైతులు కృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘ వేందర్గౌడ్ తెలిపారు.
Updated Date - 2021-07-24T07:00:23+05:30 IST