Suryapet: పోలీస్స్టేషన్ ముందు గిరిజనుల ఆందోళన..ఎస్ఐపై దాడికి యత్నం
ABN, First Publish Date - 2021-11-11T15:32:00+05:30
జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్ ముందు రామోజీ తండావాసుల ఆందోళనకు దిగారు.
సూర్యాపేట: జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్ ముందు రామోజీ తండావాసుల ఆందోళనకు దిగారు. దొంగతనం అనుమానంతో రామోజీ తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్ అనే యువకుడిని బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్లో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడిన వీరశేఖర్తో పోలీస్ స్టేషన్ ముందు 200 మంది గిరిజనులు ఆందోళనకు దిగారు. ఎస్ఐపై దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Updated Date - 2021-11-11T15:32:00+05:30 IST