సూర్యాపేటలో లింగమంతుల స్వామి జాతర...పాల్గొన్న మంత్రి జగదీష్
ABN, First Publish Date - 2021-03-01T13:35:11+05:30
జిల్లాలోని సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో నిర్వహించిన లింగమంతుల స్వామి జాతరలో మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట: జిల్లాలోని సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో నిర్వహించిన లింగమంతుల స్వామి జాతరలో మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి పాల్గొన్నారు. గత అర్ధరాత్రి దేవరపెట్టేకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఆపై దేవరపెట్టెను కదిలించే యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. యాదవ పెద్దలతో కలిసి ఓ లింగా.. అంటూ మంత్రి జగదీష్ బేరీలు వాయించి సందడి చేశారు. అర్ధరాత్రి దాటాక గుట్టపైకి దేవరపెట్టె చేరుకోవడంతో జాతర మొదలైంది. దీంతో పెద్దగుట్ట భక్తులతో జనసంద్రంగా మారింది. గజ్జెల లాగులు, భేరీల చప్పుళ్ళు, కత్తుల విన్యాసాలు, బోనాల గంపల ప్రదర్శనలు...ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో పెద్దగట్టు పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. ఈరోజు నుండి 4 వరకు జరగనున్న లింగమంతుల స్వామి జాతర జరుగనుంది.
Updated Date - 2021-03-01T13:35:11+05:30 IST