సీతారాముల ఆశీస్సులు ఉండాలి : మంత్రి
ABN, First Publish Date - 2021-04-21T06:09:24+05:30
ఆదర్శప్రాయ జంటగా కొలిచే సీతారాముల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మంత్రి గుంటకండ్ల జగదీ్షరెడ్డి ఆకాంక్షించారు.
సూర్యాపేటటౌన్, ఏప్రిల్ 20: ఆదర్శప్రాయ జంటగా కొలిచే సీతారాముల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మంత్రి గుంటకండ్ల జగదీ్షరెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలో దేవాలయ పూజార్లు, అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్యాణ మహోత్సవాన్ని ఆన్లైన్ ప్రసారాల్లో దర్శించుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి వేడుకలను ఇంట్లోనే నిర్వహించుకోవాలన్నారు.
Updated Date - 2021-04-21T06:09:24+05:30 IST