సాగర్ను అభివృద్ధి చేసింది నేనే
ABN, First Publish Date - 2021-04-14T06:29:52+05:30
సాగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తానేనని, ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదని కాం గ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి
నిడమనూరు, ఏప్రిల్ 13: సాగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తానేనని, ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదని కాం గ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. మండలంలోని ఊట్కూరు, నందికొండవారిగూడెం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంతా కాంగ్రెస్ చలవేనని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కూడా కాం గ్రెస్ పార్టీనే అన్నారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, కనీ సం ఒక్క పేదవాడికైనా పక్కా ఇల్లు కట్టించారా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించిం ది తానేనన్నారు. కేసీఆర్ పాలనలో మాటలు మినహా చేతలు లేవని దుయ్యబట్టారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్న టీఆర్ఎ ్సకు ఉప ఎన్నికలో సరైన బుద్ధిచెప్పాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మేధావులు, యువకులు, ప్రజలు తనకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీ సీ నందికొండ రామేశ్వరి, సర్పంచ్ నర్సింగు విజయ్కుమార్, రంగశాయిరెడ్డి, మేరెడ్డి శ్రీనివా్సరెడ్డి, నర్సింగు కృష్ణయ్య, శివమారయ్య, కొండా శ్రీనివా్సరెడ్డి, పిల్లి రాజు, విశ్వనాధుల రమేష్, కుందూరు లక్ష్మారెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు.
Updated Date - 2021-04-14T06:29:52+05:30 IST