ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోచంపల్లి ‘పోతన’ నరసింహులు కవి మృతి

ABN, First Publish Date - 2021-11-06T06:55:05+05:30

పోచంపల్లి పోతనగా పేరొందిన భూదానపోచంపల్లికి చెందిన సహజకవి కైరంకొండ నరసింహులు గురువారం మృతి చెందారు.

కైరంకొండ నరసింహులు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదానపోచంపల్లి, నవంబరు 5: పోచంపల్లి పోతనగా పేరొందిన భూదానపోచంపల్లికి చెందిన సహజకవి కైరంకొండ నరసింహులు గురువారం మృతి చెందారు. ము న్సిపల్‌ కేంద్రంలోని మార్కండేయనగర్‌ కాలనీకి చెందిన నరసింహులు చిన్నతనం నుంచి పౌరాణిక చిత్రాలు చూసి పద్యాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇతడు చదివింది పాఠశాల విద్యే అయినా పద్యంపై మక్కువతో చందస్సు పుస్తకాలు చదివి పద్యాలను రాస్తూ కవిగా పేరొందారు. చేనేత వృత్తి చేస్తూనే.. పద్మశాలీ శతకం, భార్గవీ శతకం, శ్రీరామ శతకం, బసవలింగ శతకం రాసి పుస్తకాలను ప్రచురించారు. అంతేకాక భజన కీర్తనలు కూడా రాసేవారు. పలు యక్షగానాలను రాసి, ప్రదర్శించారు. సీతాపతి సినిమా సందడి, నేటి భారతం సాంఘిక నాటకాలు రచించి ప్రదర్శించారు. ఈయన ప్రతిభను గుర్తించిన గోరేటి వెంకన్న స్వయంగా నరిసింహులు ఇంటికి వచ్చి ఘనం గా సన్మానించారు. పో చంపల్లి పోతనగా పేరుగాంచిన ఈయన కవి సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొని తన గానం వినిపించేవారు. పలు సాహితీ అంశాలతో రాణించి పద్యమే శ్వాసగా బతికిన నరసింహులు 4న తుదిశ్వాస విడిచారు. ఇతని మృతి పట్ల స్థానిక త్రివేణి సాహితీ సంఘం ప్రతినిధులు, కవులు, కళాకారులు సంతాపం తెలిపారు. 




 

 

Updated Date - 2021-11-06T06:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising