యాదాద్రీశుడికి ఘనంగా నిత్యపూజలు
ABN, First Publish Date - 2021-07-30T05:57:14+05:30
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామునే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు.
యాదాద్రి టౌన్, జూలై 29: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యపూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామునే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వహించి నిత్య తిరుకల్యాణ వేడుకలను ఆగమ శాస్త్రరీతిలో చేశారు. సాయంత్రంవేళ బాలాలయంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి వెండిజోడు సేవ నిర్వహించారు. స్వామికి నిత్యారాధనలు, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. అనుబంధ రామలింగేశ్వర స్వామిని శైవసంప్రదాయ రీతిలో కొలిచారు. స్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.5,31,661 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
Updated Date - 2021-07-30T05:57:14+05:30 IST