Nallagonda: ఇద్దరు చిన్నారులతో సహా తండ్రి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-12-24T14:37:25+05:30
జిల్లాలోని దామరచర్ల మండలం నూనావత్ తండాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నల్గొండ: జిల్లాలోని దామరచర్ల మండలం నూనావత్ తండాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కుటుంబ కలహాలే ఈ అఘాయిత్యానికి కారణంగా తెలుస్తోంది. వ్యవసాయ పొలం వద్ద తండ్రి గేరు కిషన్(32) తన ఇద్దరు కుమారులు హర్షవర్ధన్ (8), అఖిల్(7)లకు విషమిచ్చి చంపి... ఆపై తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-12-24T14:37:25+05:30 IST