ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ, ఏపీ మధ్య వాహన రాకపోకలపై ఆంక్షలు

ABN, First Publish Date - 2021-05-05T18:04:42+05:30

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన రామాపురం(కోదాడ), పొందుగుల(వాడపల్లి), నాగార్జున సాగర్(మాచర్ల వైపు)మూడు చెక్ పోస్టులను మూసివేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కర్ఫ్యూపై  ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాలలోకి అనుమతి ఇవ్వనున్నారు. కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు ఉంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. బోర్డర్ చెక్‌పోస్ట్‌ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది.

Updated Date - 2021-05-05T18:04:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising