నల్గొండ నడిబొడ్డున భారీ చోరీ
ABN, First Publish Date - 2021-10-24T20:45:48+05:30
నల్లగొండ నడిబొడ్డున భారీ చోరీ జరిగింది. పట్టపగలు లక్ష్మీనగర్ కాలనీలో దొంగలు హాల్ చల్ చేశారు.
నల్లగొండ: పట్టణంలోని నడిబొడ్డున భారీ చోరీ జరిగింది. పట్టపగలు లక్ష్మీనగర్ కాలనీలో దొంగలు హాల్ చల్ చేశారు. ఇంటి తాళాలు పగులగొట్టి 15 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు దోచుకుపోయారు. నల్గొండ ఎమ్మెల్యే, ఎంపీల నివాసాలకు దగ్గరలోని ఓ ఇంట్లో చోరీ జరిగడంతో స్థానికులు భయపడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా అమెరికా వెళ్లేందుకు బాధిత కుటుంబం డబ్బులు సమకూర్చుకున్నట్లు సమాచారం.
Updated Date - 2021-10-24T20:45:48+05:30 IST