తల్లీకుమారుడు అదృశ్యం, కేసు నమోదు
ABN, First Publish Date - 2021-04-11T06:52:42+05:30
తల్లీకుమారుడు అదృశ్యమైన సంఘటన జిల్లాకేంద్ర ంలో శనివారం జరిగింది.
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 10 : తల్లీకుమారుడు అదృశ్యమైన సంఘటన జిల్లాకేంద్ర ంలో శనివారం జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ మండల పరిధిలోని ఐతవారిగూడెం గ్రామానికి చెందిన తోక ల మంగ, భర్త రమేష్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 8న భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన మంగ కుమారుడు పవన్కుమార్ను తీసుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగ తల్లి మొగిలి పూలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వరి కోత మిషన్ ఢీకొని వార్డు మెంబర్ దుర్మరణం
కనగల్, ఏప్రిల్ 10 : వరికోత మిషన్ ఢీకొని వార్డు మెంబర్ దుర్మరణం చెందా డు. ఈ సంఘటన మండలంలోని జీఎడవల్లి గ్రామంలో శనివారం జరిగింది. ఎస్ ఐ సతీ్షరెడ్డి కథనం ప్రకారం. జీఎడవల్లి గ్రామానికి చెందిన నర్సింహ(50) మిషన్తో పొలం కోయిస్తున్నాడు. డ్రైవర్ మిషన్ రివర్స్ తీస్తున్న క్రమంలో వెనుక ఉన్న నర్సింహ గమనించకుండా అతని మీదుగా తీసుకెళ్లాడు. ప్రమాదంలో తీవ్రగాయాలైన నర్సింహను నల్లగొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-04-11T06:52:42+05:30 IST