ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మరోసారి మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్

ABN, First Publish Date - 2021-07-29T21:19:29+05:30

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మరోసారి మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మరోసారి మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్‌ను సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని, మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాటం చేస్తున్నారని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజలకు సేవ చేయాలనే సోయిలేదని జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు.


ఈ నెల 26న చౌటుప్పల్‌లో మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం జరిగింది. చౌటుప్పల్‌ మునిసిపల్‌ కేంద్రంలో రేషన్‌కార్డుల పంపిణీ సందర్భంగా ప్రోటోకాల్‌ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల నినాదాలు, మంత్రి జగదీష్‌రెడ్డి చేతిలోని మైక్‌ను రాజగోపాల్‌రెడ్డి లాక్కోవడం వంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఐపీసీ 186, 353, 427సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-07-29T21:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising