తోడేస్తున్నారు..
ABN, First Publish Date - 2021-06-19T06:14:38+05:30
ఇసుకాసురుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ధనార్జనే ధ్యేయంగా, వాగులు, వంకలను తోడేసి, చివరికి బ్రిడ్జీల కింది ఇసుకను సైతం వదలడంలేదు.
ఇసుకాసురుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ధనార్జనే ధ్యేయంగా, వాగులు, వంకలను తోడేసి, చివరికి బ్రిడ్జీల కింది ఇసుకను సైతం వదలడంలేదు. వీరి నిర్వాకంతో తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలోని అనంతారం వద్ద బిక్కేరు వాగులో పిల్లర్ల కింద బేస్మెంట్ తేలి, బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలు ఈ బ్రిడ్జిపైనుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ వంతెన మీదుగా నిత్యం వెళ్లే అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం దీన్ని పట్టించుకోవడం లేదు.
- (తిరుమలగిరి)
Updated Date - 2021-06-19T06:14:38+05:30 IST