ఏ హోదాలో ఉన్నా సొంత ఊరిని మరువను : శ్రీకళారెడ్డి
ABN, First Publish Date - 2021-08-30T06:26:59+05:30
తాను ఏ హోదాలో ఉన్నా సొంత ఊరిని మర్చిపోనని, గ్రామ అభివృద్ధికి చేయూతనిస్తానని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జోన్పూర్ జడ్పీ చైర్పర్సన్ శ్రీకళారెడ్డి అన్నారు. చైర్ పర్సన్గా ఎన్నికైన తర్వాత భర్త మాజీ ఎంపీ ధనుంజయసింగ్తో కలిసి స్వగ్రామం మండలంలో రత్నవరానికి ఆదివారం వచ్చారు. గ్రామంలోని రామాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నా రు. ఆలయ అభివృద్ధికి సహ
నడిగూడెం, ఆగస్టు 29: తాను ఏ హోదాలో ఉన్నా సొంత ఊరిని మర్చిపోనని, గ్రామ అభివృద్ధికి చేయూతనిస్తానని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జోన్పూర్ జడ్పీ చైర్పర్సన్ శ్రీకళారెడ్డి అన్నారు. చైర్ పర్సన్గా ఎన్నికైన తర్వాత భర్త మాజీ ఎంపీ ధనుంజయసింగ్తో కలిసి స్వగ్రామం మండలంలో రత్నవరానికి ఆదివారం వచ్చారు. గ్రామంలోని రామాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నా రు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. అనంతరం భర్త, తల్లి లలితరెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసు కున్నారు. తండ్రి కీసర జితేందర్రెడ్డి ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను కొనసాగిస్తానని తెలిపారు. వారి వెంట సర్పంచ్ పగడాల పద్మాప్రభాకర్రెడ్డి, వెంకటరాంరెడ్డి, మాజీ సర్పం చులు పశుపులేటి వినయవర్ధన్రెడ్డి, రామిని విజయ్వర్ధన్రెడ్డి, సో మగాని రవిగౌడ్, రామిని సైదిరెడ్డి, పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-30T06:26:59+05:30 IST