ఆపత్కాలంలో ప్రభుత్వం ఆసరా : భాస్కర్రావు
ABN, First Publish Date - 2021-04-23T06:36:44+05:30
కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటోందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
మిర్యాలగూడ, ఏప్రిల్ 22 : కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటోందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువా రం ఆయన స్థానిక హనుమాన్పేటలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు రూ.2వేల నగదు, 25కేజీల బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనా కల్లోలంతో పాఠశాలలు మూతబడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ప్రభుత్వం సంకల్పించిదన్నారు. ఈ సందర్భంగా అర్హులైన 988మందికి ప్రభుత్వ ఆసరా అందించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, తహసీల్దార్ గణేష్, ఎంఈవో బాలాజీనాయక్, కౌన్సిలర్ వంగాల నిరంజన్రెడ్డి, టస్మా పట్టణ కార్యదర్శి శ్రీనివాస్, చారి, శ్యామ్సుందర్, నీలిమా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-23T06:36:44+05:30 IST