ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కిందపడి యువకుడి బలవన్మరణం

ABN, First Publish Date - 2021-12-07T06:36:23+05:30

రైలుకింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భువనగిరి శివారులోని ముత్తిరెడ్డిగూడెం రైల్వే క్రాసింగ్‌ వద్ద సోమవారం రాత్రి జరిగింది.

భగతశేఖర్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరిరూరల్‌, డిసెంబరు 6: రైలుకింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భువనగిరి శివారులోని ముత్తిరెడ్డిగూడెం రైల్వే క్రాసింగ్‌ వద్ద సోమవారం రాత్రి జరిగింది. రైల్వే ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..... భువనగిరి పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, భువనగిరి పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు చుంచు నాగభూషణం పెద్ద కుమారుడు చుంచు భగతశేఖర్‌ (32) భువనగిరి శివారులోని ముత్తిరెడ్డిగూడెం రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు ఈ విషయం రైల్వే పోలీసులకు సమాచారం అందజేయడంతో సెల్‌ఫోన ఆధారంగా మృతుడిని గుర్తించారు. మృతదేహం బాగా ఛిద్రమైంది. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు భగతశేఖర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2021-12-07T06:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising