ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి

ABN, First Publish Date - 2021-05-05T06:14:48+05:30

తోటివారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు.

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీపీ నారాయణరెడ్డి 

భువనగిరి టౌన్‌, మే 4: తోటివారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు. భువనగిరిలో పట్టణ పోలీసులు, రెడ్‌క్రాస్‌ సంస్థ సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో రక్తనిల్వలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా సకాలంలో రక్తం అందక పలువురు మృత్యువాతపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ యాదాద్రి జోన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అలాగే బుధవారం యాదగిరిగుట్టలో, గురువారం చౌటుప్పల్‌లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 93 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ భుజంగరావు, ఏసీపీ శ్రీనివాసరావు, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌, రెడ్‌క్రాస్‌ ప్రతినిధి దిడ్డి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-05T06:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising