సహకార సంఘాల బలోపేతానికి కృషి : ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2021-06-20T05:47:43+05:30
సహకార సంఘాల బలోపేతానికి తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడ పీఏసీఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కోదాడ / నడిగూడెం, జూన్ 19 : సహకార సంఘాల బలోపేతానికి తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. కోదాడ పీఏసీఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయాన్ని నమ్ముకొని, బతుకుతున్న రైతులకు, సకాలంలో సహకార సంఘాల ద్వారా రుణాలు అందించి, ఆదుకుంటామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించటమేకాక, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆవుల రామారావు, కొండ సైదయ్య, శీరిషలక్ష్మీనారాయణ, పుల్లారెడ్డి, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, డైరక్టర్లు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా నడిగూడెం మండలం రత్నవరంలో బత్తిని నాగమణికి వైద్య ఖర్చుల కోసం మంజూరైన రూ.2.5 లక్షల చెక్కును పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతిమధుబాబు, కురాకుల కృష్ణమూర్తి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కాసాని కిషోర్, ఉపేందర్ పాల్గొన్నారు.
Updated Date - 2021-06-20T05:47:43+05:30 IST