‘దళితబంధు’ చరిత్ర సృష్టిస్తుంది: ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2021-07-28T05:46:14+05:30
దళితబంధు పథకం దేశంలో చరిత్ర సృష్టించబోతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
హుజూర్నగర్ / హుజూర్ నగర్ రూరల్, జూలై 27 : దళితబంధు పథకం దేశంలో చరిత్ర సృష్టించబోతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని గోవిందాపురంలో ఇటీవల డెంగ్యూతో మృతి చెందిన ఉండేటి పవన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే కాం్యప్ కార్యాలయంలో రంగాపురానికి చెందిన గుండు వంశీ వైద్యఖర్చుల నిమిత్తం 3 లక్షల ఎల్ఓసీని మంజూరు పత్రాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల కోసమే దళితబంధు ఏర్పాటుచేశారని విమర్శించడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో అమర్నాథ్రెడ్డి, ఇట్టిమళ్ళ మధు, చిలకబత్తిని సౌజన్య, ధనుంజయ్, ఇందిరాల రామకృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా వేపలసింగారం గ్రామంలో ఇటీవల మృతి చెం దిన టీఆర్ఎస్ కార్యకర్త గోపిరెడ్డి వీరారెడ్డి కుటు ంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ అన్నెం శిరీషకొండారెడ్డి, ఎంపీటీసీ గోపిరెడ్డి, మార్కెట్ ఛైర్మన్ కడియం వెంకటరెడ్డి, రెక్కల శంభిరెడ్డి, సారెడ్డి భాస్కర్రెడ్డి, నందిరెడ్డి సైదిరెడ్డి, రామిరెడ్డి, గోపిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2021-07-28T05:46:14+05:30 IST