ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోటాపోటీగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దిష్టిబొమ్మల దహనం

ABN, First Publish Date - 2021-10-25T05:33:54+05:30

తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారంటూ టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యర్థి పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశాయి.

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, అక్టోబరు 24:తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారంటూ టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలు ప్రత్యర్థి పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశాయి. పోటాపోటీగా ఉద యం టీఆర్‌ఎస్‌ నాయకులు కోదాడ-హుజూర్‌నగర్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, ఎంపీ ఉత్తమ్‌ దిష్టిబొమ్మ అంత్యక్రియలు నిర్వహించి, దహనం చేశారు. ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌కు ఉత్తమ్‌ క్షమాపణ చెప్పాలని డిమా ండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా సైదయ్య, శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీపీ ప్రశాంతికోటయ్య, దొడ్డా సురేష్‌, బొలిశెట్టి నాగేంద్రబాబు, బట్టు శివాజీ, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎంపీ ఉత్తమ్‌ దిష్టిబొమ్మను దహనం చేసినందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోదాడ-హుజూర్‌నగర్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఎమ్మెల్యే మల్లయ్య దిష్టిబొమ్మను దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కీత వెంకటేశ్వర్లు, ఎడవెల్లి పుల్లారావు, భాస్కర విజయ్‌, రాయబారపు వెంకటేశ్వర్లు, నర్సింహారావు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-25T05:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising