అన్నిదారులూ.. హైదరాబాద్ వైపు
ABN, First Publish Date - 2021-10-18T06:20:32+05:30
పల్లెలు పట్టణానికి పయనమయ్యాయి. దసరా వేడుకలకు వారం ముందుగానే సొంతూళ్లకు చేరుకున్న ప్రజలు, పండుగ ముగియగానే తిరు గు ప్రయాణమయ్యారు.
బీబీనగర్, చౌటుప్పల్ రూరల్ : పల్లెలు పట్టణానికి పయనమయ్యాయి. దసరా వేడుకలకు వారం ముందుగానే సొంతూళ్లకు చేరుకున్న ప్రజలు, పండుగ ముగియగానే తిరు గు ప్రయాణమయ్యారు. సెలవులు ముగియడం, సోమవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండడం, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే వారు ముందుగానే హైదరాబాద్కు బయలుదేరారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా, బీబీనగ ర్ మండలం గూడూరు టోల్ప్లాజాలు వాహనాల రద్దీతో కిటకిటలాడాయి.
Updated Date - 2021-10-18T06:20:32+05:30 IST