రోడ్డు ప్రమాదంలో గుట్ట వాసి మృతి
ABN, First Publish Date - 2021-01-21T06:20:18+05:30
రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్ట వాసి మృతిచెందాడు.
యాదాద్రి రూరల్, జనవరి 20: రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్ట వాసి మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టలోని బీసీ కాలనికి చెందిన రుద్రాక్ష శ్రవణ్, మహేష్, ములకల్ల మల్లేశ్లతో పాటుగా మరో ఆరుగురు మొత్తం స్నేహితులు కలిసి ఈ నెల 18న వరంగల్ జిల్లా తొర్రూర్ మండలంలోని అన్నారం దర్గా దర్శనం చేసుకోవడానికి నాలుగు ద్విచక్రవాహనాలపై వెళ్లారు. రాత్రి అక్కడే బసచేసి మంగళవారం ఉదయం దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. తిరుగు ప్రయాణంగా అదే రోజు రాత్రి బయలుదేరి వస్తుండగా తిరుమలగిరి మండలంలోని మామిడాల గ్రామ సమీపంలో రోడ్డుపై నిలిపివున్న లారీని శ్రవణ్, మల్లేష్ వెళ్తున్న ద్విచక్రవానం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో శ్రవణ్ మృతి చెందాడు. మల్లేష్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లేష్ వెంటలేటర్లపై చికిత్స పొందుతున్నాడని తెలిసింది.
Updated Date - 2021-01-21T06:20:18+05:30 IST