15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN, First Publish Date - 2021-03-06T06:20:20+05:30
15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కోదాడ రూరల్, మార్చి 5: మండలంలోని గణపవరంస్టేజి వద్ద శుక్రవారం సాయం త్రం ఆటోలో తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు రూరల్ ఎస్ఐ సైదులు తెలిపారు. ఆటోను స్వాధీనపర్చుకుని బియ్యం సరఫరా చేస్తున్న భూక్య రవిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల గణపవరం నుంచి ఆంధ్రాకు పెద్దఎత్తున రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా పెంచినట్లు ఆయన చెప్పారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - 2021-03-06T06:20:20+05:30 IST