వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10మందికి గాయాలు
ABN, First Publish Date - 2021-03-01T06:26:13+05:30
అడ్డగూడూరు మండలంలో ఆది వారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10పమదికి గాయాల య్యాయి. చౌళ్లరామారం- చిర్రగూ డూరు రోడ్డులో ట్రాక్టర్, బైక్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అడ్డగూడూరు, ఫిబ్రవరి 28: అడ్డగూడూరు మండలంలో ఆది వారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10పమదికి గాయాల య్యాయి. చౌళ్లరామారం- చిర్రగూ డూరు రోడ్డులో ట్రాక్టర్, బైక్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం... నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజపురానికి చెంది న ట్రాక్టర్ వలిగొండ-తొర్రూర్ రోడ్డు మీదుగా సుర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఈటూరుకు వెళ్తుండగా తిరుమలగిరి నుంచి మండలంలోని చౌళ్ళరామారం గ్రామానికి ఎదురుగా వస్తున్న బైక్ను ట్రాక్టర్ ఆదుపుతప్పి ఢీ కొట్టడంతో బైక్ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్, వంశీలకు కాళ్లు విరిగి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు తిరుమలగిరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.
ఆటో బైక్ ఢీకొని..
ఆటో బైక్ ఎదురెదురుగా ఢీకొని ఎనిమిది మందికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చిర్రగూడూరు-చౌళ్లరామారం రోడ్డు మార్గ మధ్యలో ఆదివారం మధ్యా హ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి తిరుమలగిరి వైపు వైళ్తున్న ఆటో తిరుమలగిరి నుంచి మోత్కూరు వైపు ఎదురుగా వస్తున్న బైక్ను ఆటో అదుపు తప్పి ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహేందర్తో పాటు భార్య ముగ్గురు పిల్లలకు, బైక్పై వెళ్తున్న యాకయ్య, భార్య ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన రెండు కుటుంబాలను చికిత్స నిమిత్తం తిరుమలగిరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.
Updated Date - 2021-03-01T06:26:13+05:30 IST