నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
ABN, First Publish Date - 2021-04-17T13:17:02+05:30
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొవిడ్ నిబంధనల...
నల్గొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొవిడ్ నిబంధనల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,20,300 ఓటర్లు ఉండగా, 8151 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. అయితే ఏకంగా 41 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ సెంటర్ వద్ద థర్మల్ స్కానింగ్, గ్లవ్స్, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
Updated Date - 2021-04-17T13:17:02+05:30 IST